అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage
చేనేత ఐక్య కులాలను వివాహ వేదిక,.
అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో
దేవాంగ,తొగట,పద్మశాలి, కుర్ని సాలె , సకుళ సాలె,వారందరూ కలసి వివాహ వేదికనుఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ వివాహ వేదికకు హాజరైన సభ్యులందరూ ఏ ఉప కులాలలైన వివాహాలు చేసుకోవడానికి,
ఇవ్వడానికి,అంగీకారం తెలుపుతూ, వధూ వరులు,రిజిస్టర్ చేసుకోవడం జరిగినది. ఇలాగే మన కుటుంబాలన్నీ కలసి ఐకమత్యముగా, వివాహ సమస్యలు గాని , ఇతర సామాజిక సమస్యలు గాని చర్చించి నిర్ణయం తీసుకుందామని, ప్రసంగించారు. సమావేశానికి హాజరైన కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఉపకులాలలో వివాహములు చేసుకోవడం ద్వారా చేనేత కులాలన్నీ ఐక్యం కావడానికి ఎంతో దోహద పడుతుంది. సమావేశానికి హాజరైన సభ్యులందరూ వధూవరుల పరిచయ వేదిక. కార్యక్రమంలో పాల్గొన్నారు.కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు నుండి విచ్చేసిన, కర్ణాటక రాజ్య నేకార ఒక్కూట (కర్ణాటక రాష్ట్ర చేనేత కుటమి) మహిళా విభాగ డైరెక్టర్ శ్రీ మతి కవిత కిరణ్ ఏగ్బోటే గారు,అర్హులైన కర్ణాటక రాష్ట్ర, చేనేత కార్మికులకు, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, ప్రయోజనాల కోసం, మరియు అన్ని చేనేత కులాల జనాభా సేకరణ కోసం, చేనేత ఉప కులాల సంఘటితం కొరకు పనిచేయు చేయున్నామని ప్రసంగించారు.నేతన్నల సంఘటితం,అభివృద్ధి, సంక్షేమం, గురించి వక్తలు,నేషనల్ హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ ఎం.వి.రమణ,దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ అంపావతి కృష్ణ మూర్తి గారు, శ్రీ జొన్నా నాగభూషణం గారు, కన్వీనర్ ,డాక్టర్. చిల్లాళె కృష్ణ మోహన్ , కార్యదర్శి,శ్రీ గొంట్టుముక్కల సాయి ప్రసాద్ , సహాయ కార్యదర్శి,ప్రసంగించారు.సమావేశంలో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కులాల సభ్యులు పాల్గొన్నారు.
జై నేతన్న....జై జై చేనేత.అంటూ పత్రిక ముంఖంగారమణ తెలిపారు.
Comments
Post a Comment