చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు! Town bank chairman
వైసీపీ నాయకులారా మీ డ్రామాలను నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు
విద్యుత్ చార్జీలు పెంపుకు జగన్ రెడ్డి గత 5 సంవతరాల్లో చేసిన పాపాలే కారణం వైసీపీ నేతలు మొట్ట మొదట జగన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి*
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైదుకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, మరియు అనంతపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ శ్రీ జే ఎల్. మురళీధర్ వైసీపీ నాయకుల ధర్నా పై ఆగ్రహం
చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడమేంటి? -ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ ను ప్రశ్నిస్తున్నారు - ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గు చేటు
ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారు ఆరు నెలలు జరగకుండానే ధర్నాలంటూ నాటకాలు మొదలుపెట్టారు విద్యుత్ వెలుగులకు చంద్రబాబు కారణం జగన్ లంచాల వల్ల కరెంటు చార్జీలు పెంపు రూపంలో ప్రజలపై భారం పడింది
జగన్ అవినీతి ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ బారాలు గత ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది జగన్ రెడ్డి కాదా? విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వైసిపి నేతలు ధర్నా చేయాలి.
విద్యుత్ రంగంపై జగన్ దాదాపు లక్ష 30 వేల కోట్లు భారం వేశారు - సోలార్, విండ్ ఎనర్జీ పిపిఏలను రద్దు చేసి ఏపీకి పదివేల మెగావాట్ల విద్యుత్తును జగన్ అందుబాటులో లేకుండా చేశాడు - విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జగన్ పోరాటం చేయడం తుగ్లక్ మించిన చర్య.
కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను వైసిపి ఓర్వ లేక పోతున్నారు విద్యుత్ చార్జీల పెంపుతో చంద్రబాబుకు సంబంధం లేదు - విద్యుత్ చార్జీలు పెంపునకు గత వైసిపి పాపాలే కారణం - గత ప్రభుత్వమే విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలిచ్చింది - స్వార్థంతోనే విద్యుత్ రంగాన్ని వైసిపి నాశనం చేసింది - అస్తవ్యస్త పాలనతో ప్రజలపై భారం మోపారు - వైసిపి వాళ్లే మోసాలు చేసి ర్యాలీలు చేస్తున్నారు - ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు - జగన్ చేసిన పాపాలు కడిగేస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాం - రాష్ట్రం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది.
ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా వైసిపి శ్రేణులు పద్ధతి మార్చుకోలేదు - కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజలు మద్దతు చూసి ఓరలేక జగన్ కొత్త డ్రామాలకు తెరలేపాడు - విద్యుత్ చార్జీల భారం జగన్ అవినీతి, అత్యాశల వల్లే - జగన్ పాలనలో విద్యుత్ రంగానికి 1, 29,53 కోట్ల నష్టం - ఐదేళ్లలో పది సార్లు చార్జీలు పెంచి రూ. 32,166 కోట్లు దండుకున్నారు.
Comments
Post a Comment