తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు కష్టకాలం రోడ్లపై ఆగిన వాహనాలుపట్టించుకోలేని అధికారులు! Talli bidda Express in neglesias
తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలకు దిక్కు ఎక్కడ👆 రోడ్లపై
బాలింతలకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాలు ఉన్నట్టుండి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా జీవీకే-ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో 270 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వీటి సేవలు కొనసాగిస్తున్నారు.ఈ వాహనాల నిర్వహణ బాధ్యత చూస్తున్న జీవీకే సంస్థ ఒప్పంద గడువు గతంలోనే ముగిసింది. కొద్ది నెలల క్రితం పిలిచిన టెండరు ప్రకారం అరబిందో ఫౌండేషన్ ఈ వాహనాలను నడపాల్సి ఉంది. అయితే వారు బాధ్యతలు తీసుకోవడంలో జాప్యమవుతుండటంతో జీవీకే సంస్థ బాధ్యతల గడువు పొడిగిస్తున్నారు. ఆ సంస్థ చివరి కాలపరిమితి డిసెంబరు 31తో ముగిసింది. మరోవైపు అరబిందో ఫౌండేషన్ ఇంకా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ల నిర్వహణ చేపట్టలేదు. ఈ వాహనాల్లో జీవీకే సంస్థ కొన్నింటిని లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. ప్రభుత్వం కాలపరిమితి పెంచకపోవడంతో ఈ వాహనాలను వెనక్కి ఇచ్చేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోతోంది.
Comments
Post a Comment