Posts

Showing posts from March, 2025

మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని! ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా CPM party

Image
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా   మంత్రాలయం: మా ప్రతినిధి: రిపోర్టర్ రవి:  G9tvNews  మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి జయరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు ఇచ్చారు. అనంతరం మంత్రాలయం తహసిల్దార్ ఎస్ రవికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా నాయకులు అంజి బాబు మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. మండలంలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వెంటనే తీర్చాలని, ప్రధానంగా మండలంలో నెలకొన్న తాగునీటి కొరత ను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట కొత్త పైపులైను మరి ముఖ్యంగా మంత్రాలయం నుండి కల్లుదేవకుంట గ్రా...

మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని!CPM Party Demand

Image
  మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని మంచి నీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ సిపిఎం పార్టీ     మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి అంజిబాబు* పెద్దకడబూరు సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు మంత్రాలయం మండలంలోని మాధవరం చెట్నిపల్లి మంత్రాలయం గ్రామాలలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ మాధవరం గ్రామంలో ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు మండలంలోని కళ్ళు దేవ కుంట గ్రామంలో మంచినీటి సమస్య కోసం మహిళలు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందని తెలిపారు అలాగే మాధవరం గ్రామంలో దళిత కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు సిమెంటు రోడ్లు వేసినప్పటికీ కాలువలు మురుగునీరు అలాగే నిలబడి వ్యాధులు ప్రబలడానికి కారణం అవుతున్నాయని తెలిపారు అలాగే మాధవరం లో ఇండ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని రెండు సెంట్లు స్థలం ఇస్తానని ప్రభుత్వం ప్రకటించిందని ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు మం...

రాచన పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ 104 సిబ్బంది డాక్టర్స్ రావడం! Doctor treatment

Image
    104 సిబ్బంది డాక్టర్స్. ఏఎన్ఎం నర్సులు    అనంతపూరం రూరల్ మండలం రాచన పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ 104 సిబ్బంది డాక్టర్స్ రావడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ. స్కూల్ నందు పిల్లలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఎండాకాలం నీళ్లు బాగా తాగాలని ప్రతి ఒక్కరు పిల్ల వాళ్లకు ఏ జబ్బులు ఉన్నాయో తెలుసుకొని మందులు పంపిణీ చేశారు. మరియు వాళ్ల తల్లిదండ్రులు లకు జబ్బులకు సంబంధించిన మందులు పంపిణీ చేశారు. అందరికీ స్వచ్ఛమైన చికిత్స అందజేశారు. అక్కడ సిబ్బంది ఏఎన్ఎంలు నర్సులు పాల్గొని ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ వాళ్లకు ఏ జబ్బులు ఉన్నాయో తెలుసుకొని మందులు ఇవ్వడం జరిగింది.

త్రాగునీటి కోసం 167వ జాతీయ రహదారి పై మహిళలు ఖాళీ బిందెలతో బటాయింపు! Mantralayam water problem

Image
  భారీగా రోడ్డుపై నీటి బిందెలతో ధర్నా. భారీగా వాహనదారులకు అంతరాయం    మంత్రాలయం నియోజకవర్గంలో నీటి కొరత :  మా G9tvNews : ప్రతినిధి రవి   త్రాగునీటి కోసం 167వ జాతీయ రహదారి పై మహిళలు ఖాళీ బిందెలతో బటాయింపు  కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో నెల రోజులుగా త్రాగునీటి సరఫరా లేక దాదాపు 1000 మందికి పైగా మహిళలు 167వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు తమ నిరసన వ్యక్తపరిచారు. దీనితో కిలోమీటర్ మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి త్రాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు .

రాప్తాడు మండలము సంబంధించి గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను వేయడం! Raptadu YSR committee

Image
రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త & మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు .. రాప్తాడు మండలము సంబంధించి గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి_జయలక్ష్మిసత్యనారాయణ_రెడ్డి, వైస్ ఎంపీపీ# బోయ_రామాంజినేయులు, మండల కన్వీనర్ సాకే వెంకటేష్, యూత్ కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి మాచిరెడ్డి చెన్నారెడ్డి వైస్ ఎంపీపీ మన్నల రవి ఎర్రగుంట భోగ రాముడు మరియు తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాభూమి కబ్జా చేశారు మాకు న్యాయం చేయండి! సీఎం చంద్రబాబుసార్! నారా లోకేష్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఒక దళిత మహిళ ఆవేదన! Deputy CM sir

Image
  సత్యసాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో దళితుల భూమి కబ్జా గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని.....  అన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న.. నారా లోకేష్ అన్న.. మా భూమి మాకు ఇప్పించండి.     మీడియా ద్వారా తెలియజేస్తున్నాము .  స్థానికంగా శివా రెడ్డి అనే వ్యక్తి మా భూమిని ఆక్రమించుకొని ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఎమ్మార్వో గారు పట్టించుకోలేదు. వెంటనే మాభూమి 508-3 సర్వే నంబర్ లో 4.94 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. అందులో మామిడి చెట్లు నాటి మా భూమి లోకి రాకుండా అడ్డుకుంటున్నాడు. మాకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నారా లోకేష్ అన్నగారికి. మేము విన్నవించుకుంటున్నాం. దయ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మరియు మాకు న్యాయం జరగకపోతే భూమిలో మేము ఆత్మహత్యకు చేసుకుంటాము. బాధ్యతలు. లక్ష్మక్క.నరసమ్మ. చిన్నప్ప.శ్యామల. నరసింహులు ఎర్రపో తప్ప... తమ భూమిలో మీడియాకు వాళ్ళ ఆవేదనాన్ని తెలియజేశారు. మరియు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి గుజ్జుల ముత్యాలమ్మ. ఎమ్మార్పీఎస్ ...

గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం!ATL ( Area Team Leader

Image
  పూర్తి స్థాయి విచారణ లేకుండా గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం సరికాదు ! అనంతపురం జిల్లా స్థానిక ఉరవకొండ పట్టణం నందు నివాసం ఉంటున్న ఎరుకల మల్లికార్జున అనే వ్యక్తి గత 6 సంవత్సరాలుగా RDT (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) ఉరవకొండ మరియు గుంతకల్లు ప్రాంతాల పరిధిలో గల కార్యాలయాల నందు అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు      పూర్తి స్థాయి విచారణ లేకుండా గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం సరికాదు !   పోలా వీరాంజనేయులు                          ఎరుకల యువ సైన్యం అధ్యక్షులు : అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అతని పై అధికారులు ATL ( Area Team Leader ) గా విధులు నిర్వహించే ఉరవకొండ నందు నల్లపురెడ్డి మరియు గుంతకల్లు నందు వరకుమర్ అనే ఇద్దరు వ్యక్తులు అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున అనే వ్యక్తిని మంచిగా మచ్చిక చేసుకొని తమకు నమ్మకస్తులైన వ్యక్తుల ఖాతాల వివరాలు ఇవ్వాలని ...

ఏపియుడబ్యూజే డైరీ ని జర్నలిస్టుల అధ్వర్యంలో ఆవిష్కరించారు! APUWJ diary launched

Image
  ఏపియుడబ్యూజే 2025 డైరీ ఆవిష్కరణ చేసిన ప్రదీప్ రెడ్డి  మంత్రాలయం : G9tvNews మా ప్రతినిధి రిపోర్టర్ రవి   2025 ఏపియుడబ్యూజే డైరీ ని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు, మంచాల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి ఆవిష్కరించారు. శనివారం ఎమ్మిగనూరు లో భీమ నిలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ప్రదీప్ రెడ్డి ఏపియుడబ్యూజే డైరీ ని జర్నలిస్టుల అధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం ఏపియుడబ్యూజే కమిటీ సభ్యులు ప్రదీప్ రెడ్డి ని శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. విలేకరులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్యూజే తాలుకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి హుశేని, కోశాధికారి షాబువలి, కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యనారాయణ చార్యులు ,సాగర్,మండల గౌరవాధ్యక్షులు రానోజిరావు, మండల అధ్యక్షులు భీమరాయ, నాగరాజు, శివ రాం, వడ్డే వెంకట్ తదితరులు ఉన్నారు.

రాజీవ్ కాలనీ పంచాయతీలో ముత్యాలమ్మ కాలనీ నందు ఉన్న స్కూల్స్ తీసేయడం! School in issued

Image
  ముత్యాలమ్మ  కాలనీలో   అనంతపురం మండలం రూరల్ మండలం రాజీవ్ కాలనీ పంచాయతీలో ముత్యాలమ్మ కాలనీ నందు ఉన్న స్కూల్స్ తీసేయడం వల్ల కాలనీ వాసులు పిల్లలు ఇబ్బంది పడుతూరని ఉపసంహరించుకుని వెంటనే దీని పైన చర్య తీసుకోవాలని 11 వార్డ్ మాజీ వార్డ్ నెంబర్ మంత్రి వరలక్ష్మి ఆవేదాన్ని వ్యక్తి చేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న  వైఎస్ఆర్సిపి నాయకురాలు లీలావతి. మరియు డేవిడ్ ఓబులేష్ మహేష్. పలువురు కాలనీవాసులు వాళ్ళ యొక్క ఆవేదాన్ని మీడియాకు తెలియజేశారు. వెంటనే ఉన్నంత అధికారులకు కలిసి మాకు కాలనీలోనే స్కూల్స్ ఉండాలని డిమాండ్ చేస్తూ. కాలనీ వాసులు అక్కడ సమస్యలను వ్యక్తీ చేశారు.    డీఈఓ కు ఎంఈఓకు.వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.